అయ్యప్పస్వామి యాత్రలో పంబానదీ - విడిది వివరాలు

_*?అయ్యప్ప చరితం - 59 వ అధ్యాయం?*_
?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️
అందరూ భక్తి పారవశ్యంతో పరవశించిపోతూ *‘‘అయ్యప్ప స్వామికి జయము ! హరిహరపుత్రుడు , ధర్మశాస్తా , మణికంఠునికి జయము ! జయము !’’* అంటూ జయజయధ్వానాలు కావించారు !
ఉదయనుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రజాకంటకుడైన ఆ దుండగుడు మరణించడంతో వాతావరణం ప్రశాంతంగా మారింది ! చల్లని గాలులు వీస్తూ హాయిని కలిగించాయి హృదయాలకు ! ఉదయనుడి మరణంతో బాధా భయాలు తొలగిపోయి తేలిక పడిన హృదయాలతో అందరూ అయ్యప్ప చుట్టూ చేరి స్తుతించారు.
 
*‘‘పాహి పాహి అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
భక్తజనప్రియ అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
కలియుగ వరదా అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
పరమ కృపాళో అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
అందరి వైపు ప్రసన్నంగా చూస్తూ అక్కడనుండి పంబానదివైపు దారితీశాడు అయ్యప్ప !
పంబానదీ - విడిది
అయ్యప్ప పంబానది తీరాన్ని చేరి పరివారంతో అక్కడ విడిది చేశాడు ! ఆ ఒడ్డునే డేరాలు వేసి అయ్యప్ప కూర్చోవడానికి ఆసనం వేశారు ! పంబానది వాళ్ళను చూసి సంతోషంతో పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తున్నది ! *‘‘గంగతో సమానమైన ఈ నది ఒడ్డున పితరులకు పిండ ప్రదానాలు చేయడం , తర్పణాలు విడవడంవల్ల ఏడు తరాలవారికి సద్గతులు లభిస్తాయి ! మీరందరూ కూడా మరణించిన మీ పెద్దలనుద్దేశించి ఈ నదీ జలాలలో తర్పణాలు అర్పించండి !’’* అని అయ్యప్ప చెప్పడంతో పరివారంలోని వారందరూ భక్తిపూర్వకంగా తర్పణాలు అర్పించారు ! అయ్యప్ప చెప్పడంతో యుద్ధంలో మరణించిన యోధులకు తర్పణాలు విడిచారు .
అయ్యప్ప అక్కడినుండి పంబల రాజుకు , తన తల్లిదండ్రులకు వెంటనే తన విడిదికి రావలసిందిగా దూతలతో వర్తమానం పంపించాడు ! వార్త అందిన వెంటనే వారు ఆనందోత్సాహాలతో బయలుదేరి పంబానదీ తీరాన్ని చేరుకున్నారు.
*‘‘కుమారా ! అయ్యప్ప ! నిన్ను కన్న మేము ధన్యులమైనాము !పంబలరాజ్యం , పాండ్య వంశం ధన్యమైనాయి. కన్నుల కరువు తీరా నిన్ను చూసే భాగ్యాన్ని మరొకసారి మాకు అనుగ్రహించావా తండ్రీ ! అంతకంటే మాకింకేం కావాలి ? నీకు సదా కృతజ్ఞులమై ఉంటాము’’* చేతులు జోడించి అంటున్న వాళ్లను వారించాడు అయ్యప్ప .
*‘‘మీరు పెద్దలు , నాకు వందనీయులు ! నాకు కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం లేదు ! నేను వచ్చిన కార్యం పూర్తయింది ! ఇక నేను నా నివాసానికి బయలుదేరవలసిన సమయం ఆసన్నమైంది ! శబరిగిరి మీద నా నివాసానికి ప్రయాణం సాగించనున్న నా వెంట మీరు కూడా అంతవరకు రావచ్చును’’* అంటూ చెప్పాడు అయ్యప్ప అందరినీ ఉద్దేశించి ! ఆ మాటలు అందరిలో ఆనందోత్సాహాలు కలిగించాయి.
*‘‘అయ్యప్పస్వామీ ! మీ వెంట మేమూ గిరిమీదకు వచ్చేందుకు అవకాశం ప్రసాదించావు ! ఎంతటి కరుణామయుడివి తండ్రీ !’’* అంటూ పరివారంలోని వారందరూ , పంబలరాజు , పాండ్యరాజు , జయవర్థనుడు , ఆయన భార్య అయ్యప్ప వెంట నడుస్తుండగా తాము వెనకగా అనుసరించారు !
పంబా నదిని దాటి శబరిగిరి వైపు దారితీశాడు అయ్యప్ప.
మందిర పునర్నిర్మాణం  
అయ్యప్ప ఆలయ ప్రవేశం
*‘‘సైనికులారా ! మీ ఆయుధాలను ఈ అశ్వత్థవృక్షం దగ్గర వుంచి , అందరూ భగవంతునిపై మనస్సు లగ్నం చేసి ముందుకు పదండి ! అదుగో ! ఆ కనిపిస్తున్న ఆలయమే మణికంఠుని కోసం విశ్వకర్మ , పరశురాములవారు నిర్మించినది’’* కొంతదూరంలో కనిపిస్తున్న ఆలయంవైపు చూపిస్తూ చెప్పాడు అయ్యప్ప !
*‘‘అలాగే స్వామి’’* అంటూ అందరూ ఆయుధాలు , అశ్వత్థ (రావిచెట్టు) వృక్షం దగ్గర భద్రపరిచి *‘స్వామియే శరణం అయ్యప్ప’* అని శరణుఘోష గొంతెత్తి పాడుతూ ముందుకు సాగారు !
అయ్యప్ప ముందు నడవగా అందరూ ఆలయాన్ని సమీపించారు ! ఉదయనుడి దాడులవల్ల ఆలయం కొంత దెబ్బతిన్నది ! పూజారులు అయ్యప్ప విగ్రహానికి పూజార్చనలు జరుపుతున్నా భక్తుల రాకపోకలు ఆగిపోయాయి ! ఆ ప్రాంతమంతా నిశ్శబ్ద నీరవం తాండవమాడుతూ ఉన్నది.
 అక్కడ కొంతకాలంగా !
అయ్యప్ప పరివార సమేతంగా అక్కడకు చేరడంతో పరిసరాలలో చైతన్యం వచ్చింది ! ఎండిపోయిన చెట్లు చిగురించి ప్రకృతి కళకళలాడింది ! అయ్యప్పకు స్వాగతం చెబుతున్నట్లు జల జలమంటూ పుష్పవృష్టి కురిసింది స్వామిమీద.
అయ్యప్ప చుట్టూరా ఒకసారి నిశితంగా పరిశీలించాడు ! ఆయన దృష్టి ఆలయం మీద కేంద్రీకృతమైంది ! అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా ఆలయం పునర్నిర్మింపబడి పూర్వపు శోభతో కలకలలాడింది ! పరశురాములవారు ప్రతిష్ఠించిన విగ్రహం యధాతథంగా దర్శనమిచ్చింది ! ఆయన నియమించిన పూజారుల వంశస్థులు పరుగు పరుగున వచ్చి అయ్యప్పకు స్వాగతం పలికారు.
 
పద్ధెనిమిది మెట్లను , చిన్ముద్రా , అభయముద్రలు చూపుతూ పట్టుబంధంలో పీఠంమీద ఆసీనమై వున్న స్వామి విగ్రహాన్ని చూస్తూ అందరూ భక్తి పారవశ్యంతో మైమరచిపోయారు.
???????????
Previous Post Next Post

نموذج الاتصال